అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన అవసరం”

అసంఘటిత కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్‌ సూచించారు. పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయంలో మంగళవారం అవగాహన కల్పించారు.
కార్మిక చట్టాలు, వేతన సవరణ చట్టం, వారి హక్కులు, బాధ్యతలను తెలియజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఉండవలసిన కనీస సౌకర్యాలు యాజమాన్యం కల్పిస్తున్నదీ లేనిది వారితో చర్చించారు.

Exit mobile version