
విజయనగరం, హైదరాబాద్లో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. “సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇంకో నలుగురు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. సౌదీలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ నుంచి వీరికి ఆదేశాలు వస్తుండేవి. అతడి ఆదేశాల మేరకు సిరాజ్, సమీర్ విజయనగరంలో తమ పేలుడు పదార్థాల్ని ప్రయోగించాలనుకున్నారు’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.