దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. గత 24 గంటల్లో 363 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,818 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా రెండు మరణాలు సంభవించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 28 మంది కరోనాకు బలయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,400 యాక్టివ్ కేసులు ఉండగా ఏపీలో 23, తెలంగాణలో 3 ఉన్నాయి.