A2Z सभी खबर सभी जिले की

ఉత్సాహంగా ప్రారంభమైన పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్

పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ క్రీడా మైదానంలో పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి 13 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ లోపు పారా క్రీడాకారులు వంద మందికి పైగా ఈ పోటిల్లో పాల్గొవడం శుభపరిణామమని అన్నారు. ప్రధానంగా రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ పోటిల్లో ప్రతిభ కనబరచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఆగష్టు లో హర్యానాలో జరుగనున్న జాతీయ స్థాయి పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2025 కొరకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్, శ్రీకాకుళం అధ్యక్షులు తురెళ్ల రాము, మన్యం జిల్లా అధ్యక్షులు చీమల రాంబాబు, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ శివగంగా, పారా నేషనల్ స్విమ్మర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!